ఈ నవరాత్రుల సమయంలో గణపతి మండపాలు జనంతో కిక్కిరిసి ఉంటాయి.. ఎక్కడ చూసినా జనసందోహంతో ఉంటాయి.. అయితే ఇదే అదునుగా కొందరు కేటు గాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు.. అలాగే పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి.. కాని ఓ ఆకతాయి చేసిన పనికి ఇప్పుడు ఓ యువతి జీవితం నాశనం అయింది. మాయమాటలు చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు, ఇంతకీ ఏమి జరిగిందనుకుంటున్నారా ఆ విషయం చెప్పుకుందాం.
మహారాష్ట్రలో వినాయకుడి మండపం వెనుక అత్యాచారం చోటుచేసుకుంది. వినాయకుడు అందంగా వున్నాడని స్నేహితులతో కలిసి నిల్చుంటే.. మాయమాటలు చెప్పి.. వినాయకుడి వెనుక వైపుకు తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. అక్కడే బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు.
మహారాష్ట్రలోని అగర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక, గణేశ్ నవరాత్రి కావడంతో స్నేహితురాళ్లతో కలిసి గ్రామంలోని వినాయక విగ్రహాలను చూడటానికి వెళ్లింది. ఓ చోట బొజ్జ గణపయ్య బాగా నచ్చడంతో అక్కడే స్నేహితురాళ్లతో కలిసి నిల్చుంది.
ఈ సమయంలో 24 ఏళ్ల మండపాల కాంట్రాక్టర్ ఆమెకు మాయమాటలు చెప్పి గణేశ్ మండపం వెనక్కి తీసుకెళ్లి అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇతను ఆడవారిపై గతంలో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడని, ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు అని అంటున్నారు.. గతంలో కూడా ఇలా అమ్మాయిలపై దాడులకు దిగాడు అని చెబుతున్నారు.. ఆమెపై ఇలాంటి అఘాయిత్యం జరుగడంతో అందరూ షాక్ అయ్యారు.. ఇక్కడ స్దానికంగా వర్క్ చేసుకుంటూ, మండపాలు ఏర్పాటు చేస్తాడు అని, ఇలాంటి వ్యక్తిని ఉరితీయాలి అని కోరుతున్నారు అక్కడ స్దానికులు.ఇక అమ్మాయిపై ఇలా దారుణానికి దిగి ఏమీ తెలియని వాడిలా అక్కడ ఓ అరగంట ఉండి పారిపోయాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని, దీనిపై జిల్లా పోలీసులు అందరూ అతని కోసం వెతుకుతున్నారు.. మైనర్ బాలికపై రేప్ చేయడంతో అతనిపై పలుకేసులు నమోదుచేస్తామని చెప్పారు పోలీసులు, అలాగే ఉమెన్ హెరాస్ మెంట్ కేసు కూడా నమోదుచేస్తామని చెప్పారు, ఇలాంటి కామాందుల నుంచి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అక్కడ పిల్లలకు పోలీసులు తెలియచేశారు.