తెలంగాణలో 45 రోజులుగా కార్మికుల గొంతు వినిపిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, అయితే ముందు ప్రభుత్వం పై పోరాటం దిశగా ముందుకు వెళ్లింది కూడా వీరిద్దరే , ఈ వివాదం కోసం కోర్టుల మెట్లు ఎక్కింది కూడా ఈ ఇరువురు నాయకులే అని చెప్పాలి, అయితే తమ డిమాండ్లు నెరవేర్చాల్సిందే అంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి నిన్న వారిని ఆస్పత్రికి తరలించారు. బలవంతంగా అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు డాక్టర్లు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారని తెలుస్తోంది. తమ దీక్ష భగ్నం అయినప్పటికీ వెనక్కు తగ్గేది లేదని అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చెబుతున్నారు.. ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్నారని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ శనివారం అఫిడవిట్ కూడా దాఖలు చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన పండుగ సమయంలో ఆర్టీసీకి చాలా నష్టం జరిగిందని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదని సునీల్ శర్మ అఫిడవిట్ లో తెలియచేశారు. దీనిపై ఆర్టీసీ జేఏసీ నాయకులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయబోతున్నామని చెబుతున్నారు. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించిన అఫిడవిట్ కూడా కోర్టులో దాఖలైంది. తెలంగాణ కేబినేట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపిందని అఫిడవిట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రింద వీడియో చూడండి
కోదండరాం ఈరోజు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఆర్టీసీ సమ్మె, ఉద్యోగాల నుండి కార్మికుల తొలగింపుపై ఈరోజు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రకారం కార్మికులను తొలగించామని వాదిస్తోంది..దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరో పక్క ఈ కేసు విషయంలో హైకోర్టు నుంచి న్యాయం జరుగకపోతే సుప్రీం కోర్టుకు వెళతామని చెబుతున్నాయి ఆర్టీసీ సంఘాలు, అదే విషయం ప్రభుత్వం కూడా చెబుతోంది, మేము సుప్రీం కోర్టుకు వెళతాం అంటున్నారు…, నేడు హైకోర్టు ఇచ్చే తీర్పు రేపటి ప్రభుత్వం- ఆర్టీసీ భవిష్యత్తుని తేల్చనుంది.
ఈ క్రింద వీడియో చూడండి
The post ఆర్టీసీ సమ్మెపై నేడే తుది తీర్పు appeared first on Telugu Messenger.