స్మార్ట్ఫోన్ల పుణ్యంతో నేరాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ కంత్రీ కుర్రోడి వ్యవహారం బట్టబయలైంది. లేడీస్ హాస్టల్లో ఉండే అమ్మాయిలు స్నానం చేస్తుంటే నగ్న వీడియోలు తీశాడు. అలా ఏకంగా 30 మంది అమ్మాయిల నగ్నవీడియోలు తీసి తన ట్యాబ్లో భద్రపరిచాడు. చివరకు ఆ కంత్రీ కుర్రోడిని ఓ అమ్మాయి గుర్తించి హాస్టల్, పోలీసు సిబ్బంది సహకారంతో అరెస్టు చేశారు. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఏరియాలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. ఇక్కడ అనేక ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు నివశిస్తూ ఉద్యోగాలు, విద్యాభ్యాసం చేస్తూ వస్తున్నారు.
ఈ హాస్టల్ పక్కనే ఓ బహుళ అంతస్తు భవనం ఉంది. ఈ భవనంలో నుంచి ఆ కంత్రీ కుర్రోడు తన మొబైల్ ఫోనులో అమ్మాయిలు బాత్రూమ్లో స్నానం చేస్తుంటే చిత్రీకరించాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్ఫోన్ ఫ్లాష్ లైట్ వెలగడాన్ని గుర్తించింది. దీంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఆ బాలుడిపై యువతులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక్కడ దారుణమైన విషయం అతను 8 వతరగతి చదువుతున్నాడు.. అతని ఫోనులో ఏకంగా 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. అయితే ఈ ఘటన మరువక ముందే మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
తాగిన మైకంలో ఓ యువకుడు ఓ మహిళ స్నానం చేస్తుండగా.. ఫోన్లో వీడియో తీశాడు. కానీ స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు…వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామంలో తన బంధువు అంత్యక్రియలకు కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. ఫూటుగా మద్యం తాగి.. ఓ వైపు అంతిమయాత్ర జరుగుతుండగానే, తాగిన మైకంలో ఉన్న అతడు ఓ ఇంటి వద్ద మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీయబోయాడు. దీన్ని గమనించిన స్థానికులు, మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చూశారుగా మత్తు ఉన్నంతసేపు విచక్షణ కోల్పోయి ఎంతటి దారుణాలకు పాల్పడుతున్నారో. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.