మన ధర్మశాస్రాలు విజ్ఞాన శాస్రాన్ని కూడా రంగరించి సమాజ హితం కోసం అనేక నియమ నిబంధనలను నిత్య జీవన విధానాల్లో ప్రవేశపెట్టాయి. సర్వాంతర్యామికి సాష్ట్రాంగ నమస్కారాలు చేసేందుకు అందరూ అర్హులే, కానీ. శారీరక నిర్మాణ పరంగా సున్నితత్వంగల స్త్రీలను మన ధర్మశాస్రాలు మోక్రాలి నమస్కారాలకే పరిమితం చేశాయి. అయితే ఇలా సాష్టాంగ నమస్కారాలు మహిళలే చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక పురుషులు రెండు కాళ్లు చేతులు తల ఉదరం అన్ని నేలపై పెట్టి ఇలా దేవుని ముందు సాస్టాంగ నమస్కారం చేస్తారు. ఇక మనకు పండితులు పురాతన కాలం నుంచి ఎన్నో శాస్త్రాల్లో తెలియచేసినా ఎక్కడా మహిళలు ఇలా సాష్టాంగ నమస్కారం చేసిన దాఖలాలు ఉండవు దీనికి ఆరోగ్య పరంగా ఇబ్బందులు రాకుండా ఇలాంటి నిర్ణయం అని తెలుస్తోంది.
సాష్టాంగ నమస్కారమనగా సర్వాగ సమర్పణతో భక్తి ప్రపత్తులతో నమస్కరించడమే. ఐతే వంశాభివృద్ధికీ, సమాజాభివృద్ధికీ కర్తలైన స్త్రీలకు సాష్టాంగ దండ ప్రమాణాల ద్వారా ఉదర భాగంతో సహా శరీర అంగాలకు ఎలాంటి హానీ జరగకుండా ఉండేందుకు ఇలా వారిని ఆ నమస్కారానికి దూరం పెట్టారు అని తెలుస్తోంది… ఇక మహిళలకు నెలసరి సమయంలో గుడిలోకి రాకూడదు అని చెబుతారు, అలాగే మద్యం స్త్రీలను సంభోగించిన తర్వాత అలాగే మాంసాహరం తిని దేవాలయాల్లోకి రాకుడదు అని చెబుతారు.. ఇదినియమంగా పాటిస్తారు.. ఇకవీటి వెనుక ఓ మంచి భోదన అయితే ఉంది అని చెప్పాలి.
సైన్స్ పుట్టకు మందు ఇలా ఇన్నిరకాల ముందులు కనుగోనక ముందు ఈ రోగాలను ఆయుర్వేదంతో నయం చేసేవారు…. ఇలా సాష్టాంగ నమస్కారం చేయాలి అనుకుంటే, మహిళల ఉదరం నేలకి తగులుతుంది.. గర్బకోశానికి ఏదైనా కీడు జరుగుతుంది అని ఇలా చేయకూడదు అని చెబుతున్నారు.. ఇక మోకాళ్ల పై ఉండి మాత్రమే నమస్కరించాలి, లేకపోతే నడుము వంచి ప్రార్ధించాలి అని చెప్పారు పండితులు. మరి చూశారుగా దీని వెనుక ఉన్న కారణం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్లరూపంలో తెలియచేయండి.