మనం చరిత్రలో అనేక గుప్త నిధుల గురించి వింటూ ఉంటాం అయితే గుప్త నిధుల గురించి మనం ఎన్ని కథలు విన్నాచ రిత్ర పుటల్లో దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు సాక్ష్యాలు కూడా ఉన్నాయి…అప్పట్లో శత్రు రాజులు దండయాత్ర చేసినపుడు తమ కోశాగారంలో ఉన్న దనం,బంగారం,మణిరత్నాలు సర్వం ఒక దగ్గర ఉంచి గుప్త ప్రదేశాలకు తరలిస్తారు.. అంతా సరిగా ఉంటే తిరిగి అవి తెచ్చుకుంటారు కాలం కర్మం కలిసి రాకపోతే వాటి పని అంతే సంగతులు.
ఇలాంటి గుప్త నిధులు ఎప్పుడూ ఎక్కడో అక్కడ దొరుకుతూనే ఉంటాయి… మన భారత దేశంలో ఇలాంటి గుప్త నిధి స్థావరాలు చాలా వరకే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది వీటిపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఇక ఇలాంటి నిధి మామూలు నిధి కాదండోయ్.. బంగారం,డబ్బు,వెండి,డైమండ్స్ అన్ని దాదాపు బిలియన్ల అమెరికా డాలర్ల విలువ. సంపద ఒక రైళ్లో కనిపిస్తే.. కళ్లు తిరిగే సంపద..వింటుంటేనే వొళ్లు జలధరిస్తుంది.. మరి అలాంటి సంపది కనుగొన్నారు..వివరాల్లోకి వెళితే.. ప్రపంచం యుద్దాలు రెండు సార్లు జరిగాయి..రెండో ప్రపంచ యుద్దం హిట్లర్ ఆధ్వర్యంలో జరిగింది.
ఇక రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో.. నాజీ సేనలు వరుసగా ఓటమి చెందుతుండడంతో జర్మన్ పాలకుడు, నాజీ నేత హిట్లర్ పోలాండ్ లో దాచిన బంగారు నిధి, విలువైన రత్నాల రాశులను ఒక రైలులో జర్మనీకి తరలించేందుకు ఆజ్ఞలు జారీ చేశాడు. ట్విస్ట్ ఏమిటంటే.. అంత నిధి నిక్షేపాలతో వెళుతున్న రైలు ఓ సొరంగ మార్గం గుండా వెళుతుంది.. కానీ అక్కడే అది తప్పిపోయింది. ఇప్పటి వరకు 1945 నుంచి అది మిస్సింగ్ కేసుగానే మిగిలిపోయింది. 1945 లో ఈ రైలు 23 కంటైనర్లలో పోలాండ్ లోని బ్రాక్లో నుంచి బయలుదేరి పోలిష్ పర్వతాల్లోని సొరంగమార్గంలో కనిపించకుండా పోయిందని చరిత్రకారులు పేర్కొంటారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
ఇక కొన్ని కారణాల వల్ల ఆ సొరంగం మార్గం కూడా మూసివేసినట్లు చెబుతారు. కాకపోతే అక్కడ ఈ నిధి కోసం ఇంకా పరిశోధనలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇలాంటి నిధుల కోసం ప్రభుత్వం తరుపునుంచి కాకుండా.. కొంతమంతి అసాంఘిక శక్తులు కూడ వేటలో ఉన్నారు. ఇప్పుడు ఆయుధాలు, డబ్బు, బంగారం, విలువైన వజ్రాలు, రాళ్లు ఉన్న ఆ సంపద రైలును ఇద్దరు గుప్త నిధులు అన్వేషించేవారు కనుగొన్నట్లు తెలుస్తుంది. కాకపోతే తమ వాటా తమకు ఇస్తేనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు పేర్కొన్నారట. మరి చూశారుగా ఎంత ఆస్తి ఉంటుందో ఇది లక్షల కోట్ల రూపాయల విలువ ఉంటుంది అని చెబుతున్నారు చరిత్ర కారులు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్లరూపంలో తెలియచేయండి.