ఈరోజుల్లోకొందరు మహిళలు మస్కా కొట్టడంలో ఒకరిని మించి మరొకరు ప్లాన్స్ వేస్తున్నారు… ప్రియుడి కోసం భర్తలను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు కొందరు మహిళలు.. ఇటీవల స్వాతి విషయం కూడా ఇలా వెలుగులోకి వచ్చిందే.. అయితే ప్రేమించినవాడిని కాకుండా తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని ప్రియుడ్ని మర్చిపోలేక అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న మహిళలు చాలా మంది ఉన్నారు. అయితే భర్త తో కలిసి ఈమె ఎటువంటి ప్లాన్ వేసిందో తెలిస్తే ఇది మహిళేనా అంటారు.
భర్తతో ఎంజాయ్ చేయడానికి ఓ యువతి.. మరో వ్యక్తిని ఫూల్ చేసింది. తనకు పెళ్లి జరిగిందన్న విషయాన్ని దాచిపెట్టి.. ఆ యువకుడిని పెళ్లాడింది. తర్వాత డబ్బు, నగలు తీసుకొని తన మొదటి భర్తతో థాయ్ లాండ్ కి జంప్ చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే…లక్నోకి చెందిన సార్థిక్ పాండ్యా కి గతేడాది డిసెంబర్ లో గోరఖ్ పూర్ కి చెందిన అర్పితా చతుర్వేదితో వివాహం జరిగింది. వివాహం జరిగిన 13రోజుల నుంచి ఆమె కనిపించకుండా పోయింది. తెలిసిన అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో.. సార్థిక్ పోలీసులను ఆశ్రయించాడు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమెకు అంతకముందే వివాహం జరిగిందని దర్యాప్తులో తేలింది. అతనితోనే ఆమె ఇప్పుడు థాయ్ లాండ్ కి వెళ్లిందని పోలీసులు తెలిపారు. కేవలం డబ్బు, నగల కోసమే సార్దిక్ ని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. కాగా.. దాదాపు రూ.4లక్షలు విలువచేసే బంగారం, డబ్బుతో అర్పిత పరారయ్యిందని.. పెళ్లి కి కూడా రూ.లక్షలు ఖర్చు చేశానని సార్ధిక్ ఆరోపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయం ఆమె మొదటి భర్తకు కూడా తెలుసు అని, ఇలా మోసం చేసి విదేశాలకు పారిపోవాలి అని ముందే ప్లాన్ రచించారట ఇద్దరు భార్య భర్తలు… పాపం సాద్విక్ మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి డబ్బుపోయే- అమ్మాయి పోయే అని బాధపడుతున్నాడట, మరి చూశారుగా ఇలాంటి వారు కూడా సొసైటీలో మన మధ్యనే ఉంటున్నారు.. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.