పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులు జారవిడిచింది…భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పేలుడు పదార్థాలతో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై బాంబులతో భీకర దాడి చేసింది భారత వైమానిక బృందం… ఈ దాడిలో భారత వైమానిక బృందం సక్సెస్ అయింది..ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది. 12 మిరాజ్-200 జైట్ ఫైటర్స్తో ఈ దాడి చేపట్టారు సైన్యం. ఇక దాడుల నేపథ్యంలో సైన్యానికి సెలవులను రద్దు చేసింది భారత ప్రభుత్వం.
వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు వంద శాతం విజయవంతమయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం దాడులు అనుకున్నట్లు జరిగాయని వెల్లడించారు… వైమానిక దళ ఫైటర్ జెట్స్ ఎల్ఓసీ దాటి ఈ దాడులు నిర్వహించాయి. బాలాకోట్, చకోటీ, ముజఫరాబాద్లో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆల్ఫా-3 నియంత్రణ కేంద్రాలను ధ్వంసం చేశాయి. బాలాకోట్కు 30 కిలోమీటర్ల దూరం వరకూ బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు చెబుతున్నారు.
పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజులకు పాక్ ఉగ్రశిబిరాలపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో విజయవంతంగా మెరుపుదాడులు నిర్వహించింది. 2016 సెప్టెంబర్ 29న నియంత్రణ రేఖను దాటి ఏడు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టింది.
భారత వైమానిక దళం తమ భూభాగంలోకి వచ్చి దాడులు జరిపినట్లు పాక్ సైన్యం ధ్రువీకరించింది. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ దాడులపై స్పందించారు. భారత విమానాలను తిప్పికొట్టినట్లు ఆయన వాదిస్తున్నారు. ముజఫరాబాద్ సెక్టార్ లోకి భారత వాయుసేన చొచ్చుకువచ్చింది. పాక్ వైమానిక దళం ఈ దాడిని తిప్పికొట్టింది. అయితే ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదు అని పాక్ ఐఎస్పీఆర్ డీజీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఈ
దాడిలో ఇప్పటి వరకూ 300 మంది మరణించారు అని తెలుస్తోంది, ఇక దీనిపై పాక్ ఎలాంటి కౌంటర్ ఇచ్చినా, తిరిగి తిప్పి కొట్టేందుకు భారత్ సిద్దంగా ఉంది అని చెబుతున్నారు ఆర్మీ అధికారులు.
ఇక పాక్ కూడా మరిన్ని దాడులు అర్ధరాత్రి పూట చేసే అవకాశం ఉంది అని సరిహద్దు గ్రామాల్లో ప్రజలు భయాందోళనలో ఉన్నారు, ఇక ఉగ్రవాదులు కూడా మరిన్ని ఆత్మాహుతి దాడులకు తెగబడితే పరిస్ధితి ఏమిటి అని ఆలోచిస్తున్నారు సరిహద్దు ప్రాంతాల్లో జనం. అయితే పాక్ ప్రజలకు ఎలాంటి
హాని జరుగకుండా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది భారత వాయుసేన… ఒకవేళ భారత్ పై ఇలా బాంబుల వర్షం కురిపిస్తే పాకిస్ధాన్ కోలుకోలేని విధంగా భారత్ బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉంది అంటున్నారు అధికారులు.