సర్వేంధ్రియాణం నయనం ప్రధానం’ అన్నారు. జ్ఞానేంద్రియాల్లో కన్ను ప్రధానమైనది. మనిషి లేచిన దగ్గరనుంచి పడుకునేవరకు నేత్రాలు ప్రతి పనిలో సహకరిస్తాయి. అందుకే ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. ఇంత ముఖ్యమైన కళ్లను వేసవి చలికాలాలలో రక్షణ పొందటానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని డాక్టర్లు చెబుతారు.. అయితే ఇది డాక్టర్లు చెప్పేమాట, కాని మాములుగా ఈ పొల్యుషన్ వాతావరణంలో బయటకు వెళ్లిన సమయంలో కంటిలో ఏదైనా నలుసు పడింది అంటే చాలు వెంటనే గిలగిలలాడిపోతాం. గతంలోలా వేసవి కాలం చలికాలమే కాదు, ఇప్పుడు ఏకాలం అయినా కంటికి సంరక్షణ అవసరం. కొందరు కళ్లజోడు పెట్టుకున్నా సరే, వారి కంటిలో దుమ్ము పురుగులు దూళిపడటం జరుగుతాయి.

ఏదైనా దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండటంవల్ల కళ్లు ఎర్రబడటం, రెప్పలు అంటుకుపోవడం, పుసులు, నీరు కారడం, కళ్లలో ఇసుక పడినట్లుగా అనిపించడం. వెలుతురును చూడలేకపోవటం, కళ్ళ మంట ఉంటుంది. ఏదైనా మన కంటికి వచ్చే ఇన్ఫెక్షన్స్వల్ల కంటి రెప్పల పై వైపునగానీ లోపలి వైపునకుగానీ కురుపులు ఏర్పడి బాధను కలిగిస్తాయి. కంప్యూటర్, టీవీలు చాలాసేపు చూస్తూ కంటికి ఎక్కువ శ్రమ ఇవ్వడంవల్ల, ద్విచక్ర వాహనాలపై కళ్లజోడు లేకుండా ప్రయాణాలు చేయటంవల్ల, కంటిలో నీరు ఎండిపోయి కంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలానే ప్రయాణం చేసిన ఓ వ్యక్తికి దారుణమైన కంటి సమస్య వచ్చింది. మరి ఆతర్వాత ఏమి జరిగింది అనేది చూద్దాం.
ఈ క్రింది వీడియో చూడండి
ఫ్రాన్స్ లో నికోలస్ అనే వ్యక్తి సాయంత్రం 7 గంటలకు తన బైక్ పై ఇంటికి వస్తున్నాడు.. ఈ సమయంలో అతని కంటిలో దుమ్ము పడింది అని భావించాడు.. వెంటనే వాటర్ వేసి చన్నీళ్లతో కన్ను శుభ్రంచేసినా, అది లోపల నుంచి రాలేదు.. మూడు రోజులు డ్రాప్స్ వాడి తర్వాత ఇంజెక్షన్ చేసుకున్నాడు.. కాని ఆ మంట మాత్రం తగ్గడం లేదు.. ఇలా ఇరవై రోజులు గడిచినా అతని కన్ను ఎర్రగా మారింది. కాని ఎటువంటి మార్పు లేదు దీంతో ఓ రోజు ఉదయం లేవగానే సన్నటి పొర పురుగులు అతని కను రెప్పలపై కనిపించాయి.. కళ్లు మంటలు వచ్చాయి, దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు.. డాక్టర్లు పరిశీలించి అతని కంటిలో ఓ పురుగు వెళ్లింది అని, అది కను రెప్పల చాటున ఉండి పొరగా ఏర్పడిపోయింది అని చెప్పారు.. దీంతో కంటి ఎరుపు అందుకే పోవడం లేదు అని తెలుసుకున్నారు. వెంటనే సర్జరీ చేసి ఆ పురుగుని తీశారు.. సుమారు 30 పొరలుగా అది ఏర్పడిపోయింది. మరికొద్ది రోజులు లేట్ అయి ఉంటే ఆ కన్ను మొత్తం పోయేది అని చెప్పారు వైద్యులు.. చూశారుగా ఏదైనా కంటి సమస్య వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఏదైనా కంటిలో పడినా చల్లని నీటితో శుభ్రం చేసి కడగాలి అనే విషయం మర్చిపోకండి.