హైదరాబాద్కు ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ భాగ్యనగరానికి క్యూ కట్టేస్తున్నారు. మ్యాచ్ చూడటం కోసం ఫ్లైట్ టిక్కెట్లతో పాటూ హోటల్స్లో రూమ్ల కోసం పోటీపడుతున్నారు. ఒక్కసారిగా హోటల్స్ బుకింగ్ ఎంక్వైరీలు ఊపందుకున్నాయట. ఎక్కువమంది మూడు రోజుల కోసం రూమ్లు బుక్ చేసుకుంటున్నారట. ఒక్కరైతే ఒక్కరోజు కోసం రూమ్ బుక్ చేసుకుంటుంటే.. ఇద్దరు ముగ్గురైతే మూడు రోజుల ప్యాకేజీవైపు మొగ్గు చూపుతున్నారట.

క్రికెట్ ఫ్యాన్స్.. అందులోనూ ముంబైతో పాటూ మహారాష్ట్రలోని నగరాల నుంచి ఎక్కువ బుకింగ్స్ ఉన్నాయట. ఫైనల్కు చేరిన ముంబై టీమ్కు మద్దతుగా హైదరాబాద్ వచ్చేస్తున్నారట. బుధవారం (08-05-2019) నుంచి ఈ బుకింగ్స్ ఊపందుకున్నాయట. శనివారం, ఆదివారం కోసం హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ముంబై, పుణె నుంచి ఉన్నారట. చెన్నై-ఢిల్లీ మధ్య మ్యాచ్ తర్వాత ఈ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ క్రింది వీడియో చూడండి
హైదరాబాద్లో ఈ వారంలోనే హోటల్ రూమ్స్ బుకింగ్ ఏకంగా 37శాతం పెరిగిపోయాయట. వీరిలో కూడా 25-34 వయసు మధ్య ఉన్నవారు ఎక్కువమంది ఉన్నారట. సాధారణంగా ఐపీఎల్ సీజన్లో హోటల్ రూమ్ బుకింగ్స్ 18శాతం పెరుగుతుంటాయట.. కానీ ఈసారి మాత్రం ఫైనల్ మ్యాచ్ ఉండటంతో బాగా పెరిగిపోయాయని చెబుతున్నారు. ముంబై ఫైనల్కు రావడం, వీకెండ్ కావడం కూడా హోటల్స్ బుకింగ్లు పెరగడానికి మరో కారణమంటున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్కు ఐపీఎల్ ఫీవర్ తీసుకొచ్చింది.

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ముంబై ఇప్పటికే ఫైనల్ చేరుకోగా.. శుక్రవారం చెన్నై-ఢిల్లీ మధ్య జరిగే క్వాలిఫయర్ మ్యాచ్లో గెలిచిన టీమ్ ఫైనల్లో ముంబైతో తలపడుతుంది. సో దీంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వివాదాలు జరుగకుండాచూస్తున్నారు అలాగే వచ్చే వారు ఎవరు వారి ఐడీ ఫ్రూపులు తీసుకుని రూమ్స్ ఇవ్వాలి అని ఎలాంటి అనుమానం కలిగినా పోలీసులకు సమాచారం అందివ్వాలి అని చెబుతున్నారు పోలీసులు.