బాబాలు సెక్స్ స్వామీజీలు మనకేం కొత్తకాదు.భారత పుణ్య భూమిలో బాబాలకు పాపిష్టి స్వామీజీలకు లోటు లేదు.నిత్యానంద స్వామి,ఆశారాం బాపు,సుభాష్ పత్రీల వారసుడు మరొకడు బయటపడ్డాడు.బయట ప్రవచనాలు చెప్తూ లోపల సెక్స్ పాఠాలు చెప్పే మరొక స్వామిజి గుట్టు రట్టయ్యింది.మహిళలను సెక్స్ కోసం వేధించడం ఈ స్వామీజీకి అలవాటు.అయితే దాని కోసం ఆ మహిళా భర్తనే సహాయం చెయ్యడం మరింత ఆశ్చర్యం కలిగించే విషయం.మరి ఆ సెక్స్ స్వామిజి గురించి పూర్తీగా తెలుసుకుందామా.
అతను బెంగుళూర్ లో ఒక స్వామిజి.అతని వద్దకు ప్రతిరోజు కొన్ని వందల మంది ఆశిసుల కోసం వస్తారు.అలా ఒక దంపతులు కూడా ఆయన ఆశీసుల కోసం చాలా రోజుల నుంచి వెళ్తున్నారు.అయితే అతనిలో ఉన్న మరొక యాంగిల్ ను వాళ్ళు పసిగట్టలేకపోయారు.ఆ దంపతులు మీద ఎక్కువ ఇంట్రస్ట్ చూపించేవాడు ఆ స్వామిజి.దానికి కారణం ఏమిటో తెలుసా..ఆ మహిళా మీద ఈ స్వామిజి కన్ను పడింది.ఆమెను అనుభవించాలనుకున్నాడు.భార్య మీదకు స్వామీజీని స్వయంగా రెచ్చిగొట్టించాడు ఆమె భర్త.దీంతో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.ఆమె తన ఫిర్యాదులో ఏం పేర్కొందంటే..సెప్టెంబర్ 4వ తేదీ అర్దరాత్రి 1 గంట సమయంలో తన భర్తతో పాటు స్వామీజీ, ఆయన శిష్యులు తన ఇంటికి వచ్చారని, ఆ సందర్బంలో స్వామీజీ తన తలవెంట్రుకలు గట్టిగా పట్టుకుని దాడి చేశారు.
తనను పూజించడానికి ఆశ్రమానికి ఎందుకు రావడంలేదని స్వామీజీ తనను కొట్టారని ఆరోపించారు.నేను రాను అంటే.. తనను పూజించి సేవ చెయ్యడానికి రాను అంటూ ఎంత ధైర్యంగా చెబుతున్నావు అంటూ స్వామీజీ పురుషపదజాలంతో దూషించారని ఆరోపించారు.బెడ్ రూంలోకి వచ్చి తన కోరిక తీర్చితే నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుందని స్వామీజీ తనను లైంగికంగా వేధించాడు. ఆ సందర్బంలో తాను తప్పించుకోవడానికి ప్రయత్నించానని, స్వామీజీ, ఆయన శిష్యులు, నా భర్త కలిసి తన దుస్తులకు నిప్పంటించారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎదురింటికి వెళ్లి తలదాచుకుందామని ప్రయత్నిస్తే స్వామీజీ శిష్యులు బలవంతంగా తనను ఆయన కారులో ఎక్కించారని, మూడు రోజుల్లో ఆశ్రమానికి వచ్చి తనకు లైంగిక కోరిక తీర్చకుంటే నీ అంతు చూస్తానని స్వామీజీ బెదిరించాడని బాధితురాలు సెప్టెంబర్ 7వ తేదీ మైసూరు నగరంలోని కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వామీజీ, తన భర్త, ఐదు మంది స్వామీజీ శిష్యులు తనపై లైంగిక దాడి చేసి శారీరకంగా హింసించారని వివాహిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు చేసిన వారిలో స్వామీజీ శిష్యుడు అనీల్ ఆచార్య ఉండటంతో అతన్ని అరెస్టు చేశారు. స్వామీజీ, మహిళ భర్త, మరో నలుగురు ఇంకా తప్పించుకుని తిరుగుతున్నారు.వాళ్ళను పట్టుకుని తీరుతాం అని పోలీసులు అంటున్నారు.చూశారుగా ఈ స్వామిజి అసలు బాగోతం.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఈ కామ స్వామిజి గురించి అలాగే స్వామీజీకి మహిళా భర్తే సహకరించడం గురించి అలాగే ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.