ప్రేమ ఇదో మాయ. తెలియని ఓ మైకం. ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో ఎవ్వరికి తెలియదు. ఇదంతా వినడానికి బాగానే ఉన్నా నిజ జీవితంలో ప్రేమ పేరుతో ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమ అనే మాయలో పడి చిన్న చిన్న విషయాలకే తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.ఏలూరుకి చెందిన ఓ యువతి గ్రూప్స్ కోచింగ్ కోసం రోజు విజయవాడకి వచ్చేది. అయితే రోజు ఆటోలో వెళ్ళేది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ తో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. రోజు గ్రూప్ కోచింగ్ అంటూ ఆ యువకుడితో ప్రేమ కోచింగ్ తీసుకుంది. కానీ అప్పటికే ఆ ఆటో డ్రైవర్ కి పెళ్లయి..ఇద్దరు పిల్లలున్నారన్న సంగతి ఆమెకి తెలియదు. అలా వారి ప్రేమ సాగిపోతున్న క్రమంలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఓ హోటల్లో ఇద్దరు శవమై ప్రత్యక్షమయ్యారు.
తమ కూతురు కనపడట్లేదని యువతి తల్లిదండ్రులు వారం క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేస్ నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అంతలో హోటల్లో రూమ్ నుండి వీరిద్దరూ రెండు రోజులైనా బయటికి రాలేదు. దుర్వాసన కూడా రావడంతో అనుమానం వచ్చి హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.అయితే ఆత్మహత్యకు సంబందించిన కారణాలు మాత్రం తెలియలేదు. పోలీసులు మాత్రం ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా..లేక తన ప్రియుడు ఆటో డ్రైవర్ అంటే తనకి పెళ్లి చేయరని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా… ప్రియుడికి పెళ్ళైన విషయం తెలిసి ఇద్దరు చనిపోయారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తుందనుకున్న కూతురు చనిపోవడంతో ఆమె తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

యువకుడి భార్య కూడా తన భర్త ఎందుకు చని పోయాడో తెలియదంటూ వాపోయింది. మొత్తానికి ఈ సంఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇక తండ్రి కూడా తన కూతురు ఇలా చేస్తుంది అని అనుకోలేదని ఇలా కూతురు మరణ వార్త వింటాను అని ఊహించలేదని కన్నీరు మున్నీరు అయ్యాడు, ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతుందనుకుంటే ఆత్మహత్య చేసుకుంది అని ఆ తండ్రి రోధించాడు. ఈ ఘటన అక్కడ వారిని కలిచివేసింది, చూశారుగా అక్రమ సంబంధాలు, అలాగే మనకు కొందరిపై వచ్చే ప్రేమల వల్ల ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సంఘటన జరగడానికి కారణం ఏమై ఉంటుంది అని మీరు భావిస్తున్నారో కామెంట్ ల రూపంలో తెలియచేయండి.